భారత్ జట్టులో కోవిడ్ కలకలం.. ఒకరికి పాజిటివ్

-

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్ జట్టులో కోవిడ్ కలకలం రేగింది. క్రికెటర్లలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. 23 మందితో కూడిన క్రికెటర్ల బృందంలో ఒకరికి కరోనా సోకింది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ గోప్యంగా ఉంచింది. విషయం బయలకు పొక్కడంతో ప్రస్తుతం క్రికెటర్‌కు ఎలాంటి కోవిడ్ లక్షణలు లేవని తెలిపింది.

కరోనా సోకిన క్రికెటర్‌ను విడిగా క్వారంటైన్‌లో ఉంచినట్లు వెల్లడించింది. కరోనా సోకిన క్రికెటర్ మినహా మిగతా జట్టు సభ్యులు డర్హమ్‌కు బయల్దేరారు. యూకేలో వ్యాప్తిలో ఉన్న డెల్లా వేరియంట్ సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ కోసం క్రికెటర్లు క్వారంటైన్‌లో ఉన్నారు. వచ్చే నెల 4 నుంచి ఇంగ్లండ్‌తో భారత్ 5 టెస్టుల సిరిస్ ఆడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news