మనసులో కల్మషం లేని వ్యక్తి కృష్ణంరాజు – కిషన్ రెడ్డి

-

నేడు రెబెల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు కేంద్రం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాజ్నాథ్ సింగ్ శుక్రవారం కేంద్రమంత్రికి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, సీనియర్ నేత చింతల రామచంద్ర రెడ్డి లతో కలిసి కృష్ణంరాజు నివాసానికి వెళ్లి కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, కుమార్తెలు, హీరో ప్రభాస్ ని పరామర్శించారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణంరాజు కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో తాను బిజెపి యూత్ నాయకుడిగా ఉన్నట్లు తెలిపారు.

అప్పుడు ప్రతిరోజు కలిసే వాళ్ళమని గుర్తుచేసుకున్నారు. భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటానని కృష్ణంరాజు కోరినట్లు తెలిపారు. అందరూ అభిమానించే వ్యక్తి కృష్ణంరాజు అని.. మనసులో కల్మషం లేని వ్యక్తి అని కొనియాడారు. రాబోయే ఎన్నికలలో దేశంలోని పలు రాష్ట్రాలలో బిజెపి ప్రచారంలో పాల్గొంటానని తనతో చెప్పారని తెలిపారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news