కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్

-

ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూసిన విషయం తెలిసిందే. నేడు బిజెపి నేత కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పరామర్శించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాజ్నాథ్ సింగ్ శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డిలతో కలిసి కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు. కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, వారి కుమార్తెలతో పాటు, సినీ హీరో ప్రభాస్ను రాజ్నాథ్ పరామర్శించారు.

కృష్ణంరాజు మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు అనారోగ్యానికి గల కారణాలు, ఏ ఏ చికిత్సలు అందించారు ఎంపీ లక్ష్మణ్ రాజనాథ్ కు వివరించారు. ప్రభాస్ కూడా కొంతసేపు రాజ్నాథ్ తో మాట్లాడారు. అనంతరం కృష్ణంరాజు కుటుంబ సభ్యులను ఓదార్చిన రాజ్నాథ్, ఇతర బిజెపి నేతలు అక్కడి నుండి బయలుదేరారు.

Read more RELATED
Recommended to you

Latest news