మొదట ప్రభాస్ సిగ్గుపడ్డాడు..కానీ ఇప్పుడు :కృతి సనన్

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలో ఆదిపురుష్ కూడా ఒకటి. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. పౌరాణిక రామాయణం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్ర లో నటిస్తున్నారు. ఇప్పటికే సైఫ్ అలీఖాన్ తన షూటింగ్ పార్ట్ కూడా పూర్తి చేసుకున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా కృతి సనన్ నటిస్తోంది. అయితే తాజాగా ప్రభాస్ గురించి కృతిసనన్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

kruthi san
kruthi san

స్క్రీన్ పై తమ జంట అందంగా కనబడుతుందని చెప్పింది. ప్రభాస్ తో తన కాంబినేషన్ బాగుంటుందని కృతిసనన్ వ్యాఖ్యానించింది. అయితే ప్రభాస్ తో వర్క్ చేయడం చాలా బాగుందని….మొదట్లో ప్రభాస్ కాస్త సిగ్గు పడినట్టు కనిపించాడని పేర్కొంది. అయితే ఆ తర్వాత అలవాటు అయ్యాక మాత్రం బాగా మాట్లాడటం మొదలు పెట్టాడు అని చెప్పింది. ప్రభాస్ తో నటించడంలో టెన్షన్ ఉండదని…చాలా హ్యాపీగా ఉందని కృతిసనన్ చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news