ఒకే కారులో కేటీఆర్, హరీశ్ రావు జర్నీ.. ఫొటోలు వైరల్..!

-

బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు సాయంత్రం జరగనున్న ఎట్ హోం కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు , కేటీఆర్  తెలంగాణ భవన్ నుంచి ఒకే కారులో బయలుదేరి వెళ్లారు. మంత్రి కేటీఆర్ స్వయంగా కారు నడుపుతుండగా.. హరీశ్ రావు ఆయన పక్కనే కూర్చున్నారు. ఈ ఫొటోలను మాజీ మంత్రి హరీశ్‌ రావు తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత.. బీఆర్ఎస్ పార్టీని నడిపించే బాధ్యతను హరీశ్, కేటీఆర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ కు కాలు ఆపరేషన్ జరగడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో వీరిద్దరూ అన్నీ తామై పార్టీని నడిపిస్తున్నారు. మరోవైపు ఇటీవలే తెలంగాణ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు గొడవ పడ్డారనే రూమర్స్ కూడా వినిపించాయి. ఆ రూమర్స్ అన్నింటిని పటా పంచల్ చేస్తూ.. తాజాగా హరీశ్ రావు,కేటీఆర్ ఒకే కారులో ప్రయాణించడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news