నేను టీడీపీని టార్గెట్ చేయలేదు : రామ్ గోపాల్ వర్మ

-

విజయవాడలో రేపు వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు డైరెక్టర్‌ ఆర్జీవీ. వ్యూహం సినిమాలో చంద్రబాబు అరెస్ట్, యువగళం, వివేకా హత్య వంటి సన్నివేశాలు ఉంటాయని తెలిపారు. ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్‌, చంద్రబాబు, లోకేష్‌ను ట్విట్టర్‌ ద్వారా ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా డైరెక్టర్ రాంగోపాల్‌ వర్మ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీని నేను టార్గెట్ చేయలేదు.  వ్యూహం మూవీలో ఎలాంటి వ్యూహం లేదన్నారు ఆర్జీవీ. సీఎం జగన్‌కు ఈ సినిమాతో ఎటువంటి సంబంధం లేదన్నారు. సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు సీఎం జగన్‌ హాజరకావడం లేదని తెలిపారు. వ్యూహం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కు రాజకీయ నాయకులను ఆహ్వానించినట్లు తెలిపారు వర్మ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేసిన యువగళం గురించి సినిమాలో ఉంటుందని తెలిపారు. వైఎస్‌ వివేకా హత్య ప్రస్తావనం కూడా సినిమాలో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వారాహి యాత్ర గురించి పెద్దగా సినిమాలో ఉండదని కూడా క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news