రజినీకి అర్థమైంది, కానీ కాంగ్రెస్ గజినీలే కన్ఫ్యూజన్ లో ఉన్నారు: కేటీఆర్

-

తెలంగాణలో కేవలం మరో ఆరు రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రోజులు దగ్గర పడుతున్నా కొద్దీ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న ఎంతలలో ఒత్తిడి పెరిగిపోతోంది అని చెప్పాలి. ఇక తాజాగా మంత్రి కేటీఆర్ ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ… హైదరాబాద్ అన్ని రంగాలలోనూ ఎంతో అభివృద్ధి చెందిందని, ఈ విషయం ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజినికాంత్ కు అర్థమైందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కానీ తెలంగాణాలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఈ విషయం అర్ధం అవడం లేదు గజినీలు లాగా ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారంటూ కేటీఆర్ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. దేశం మొత్తం వ్యాపించిన కోవిడ్ సమయాన్ని తీసేస్తే మేము పాలించింది కేవలం ఆరున్నరేళ్లే అంటూ కేటీఆర్ స్పష్టంగా తెలియచేశాడు.

అయినప్పటికీ ఇంత తక్కువ కాలంలోనే ఎంతో అభివృద్ధి చేశామంటూ కేటీఆర్ చెప్పుకున్నారు. మేము తీసుకువచ్చిన ప్రతి ఒక్క పథకం కూడా అందరికీ చేరాయని ఇంతకన్నా మా అభివృద్ధికి తార్కాణం ఏముంటుందంటూ కేటీఆర్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news