రూ.70 ఉన్న పెట్రోల్‌ ధరను రూ.110 చేసిన ప్రధాని దేవుడా?: కేటీఆర్‌

-

నారాయణపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పర్యటించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పేట మండలం సింగారం వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గంలో మొత్తం రూ.184.42 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తర్వాత కేటీఆర్.. జిల్లా కేంద్రంలోని ఓ మైదానంలో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో పాల్గొని ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌ ఉమ్మడి పాలమూరు జిల్లాలో 11 లక్షల ఎకరాలకు నీరు అందించారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. “రైతులకు ఉచిత విద్యుత్‌, రైతుబంధు ఇస్తున్న ప్రభుత్వం ఇది. మోదీ సర్కార్‌ కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చమంటే తేల్చటం లేదు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వట్లేదు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరుతూ బీజేపీ రాష్ట్ర శాఖ తీర్మానం చేయాలి. రూ.400 గ్యాస్‌ ధరను రూ.1200 చేసిన ప్రధాని దేవుడా? రూ.70 ఉన్న పెట్రోల్‌ ధరను రూ.110 చేసిన ప్రధాని దేవుడా?” అని కేటీఆర్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news