నాతో ఉన్నోడే నా వాడు, వెనక్కు రండి, రెబల్స్ కి కేటిఆర్ డెడ్ లైన్…!

-

తెలంగాణా మంత్రి కేటిఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాల్లో తెరాస అభ్యర్ధుల తరుపున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. విపక్షాలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేసారు. ఎన్నికలు రాగానే మీ ఇంటి ముందుకి వచ్చే వారిని చూసి మోసపోవద్దని అలాంటి వారికి ఓట్లు వేయొద్దని కెసిఆర్ కోరారు.

ఈ సందర్భంగా ఆయన హామీల వర్షం కురిపించారు. తెలంగాణాలో అన్ని పట్టణాలను అబ్బురపడే విధంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. సిరిసిల్లకు ఎప్పుడైనా ఎస్పీ కలెక్టర్ వస్తారాని ఊహించారా అంటూ కేటిఆర్ ప్రశ్నించారు. ఎన్నికలు నావే అనుకోండి, కేటిఆర్ కి ఓటు వేస్తున్నట్టుగా భావించండి అంటూ కేటిఆర్ విజ్ఞప్తి చేసారు. తెరాస ను ఎన్నికల పరీక్షలో గెలిపించాలని కేటిఆర్ విజ్ఞప్తి చేసారు.

తప్పు చేస్తే ముందు తెరాస నుంచే మొదలుపెడతామని అన్నారు. గెలిపించే బాధ్యత మీది, పని చేయించే బాధ్యత నాది అంటూ వ్యాఖ్యానించారు. సిరిసిల్లను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని అన్నారు. ఇక ఈ సందర్భంగా రెబల్స్ ని లక్ష్యంగా చేసుకుని కేటిఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. రెబల్స్ అందరూ వెనక్కు రావాలని కేటిఆర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు.

మీరు అందరూ నా వాళ్ళు, నాతో ఉన్నవాడు నావాడు, నాతో లేని వాడు నా వాడు కాదు. ఇంకా నాలుగు రోజులు సమయం ఉంది, మీ అందరిని చూసుకునే బాధ్యత నాది అంటూ హామీ ఇచ్చారు. కౌన్సిలర్ లు పని చేయకపోతే పదవుల నుంచి పీకేస్తామని హెచ్చరించారు. ఇక ఈ సందర్భంగా భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. కేటిఆర్ రోడ్ షో కి స్థానిక ప్రజలు నాయకులు బ్రహ్మరధం పట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news