కేసీఆర్‌ కు షాక్‌.. BRS పార్టీ కార్యాలయం ప్రారంభానికి KTR దూరం !

-

ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభానికి సర్వం సిద్ధం అయింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల తర్వాత బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలోనే కేంద్ర బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఈ కార్యక్రమానికి యూపీ మాజీ సీఎం అఖిలేష్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్ సతీమణి శోభమ్మ హాజరయ్యారు.

అయితే, నేడు జరగనున్న బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ హాజరు కావడం లేదని తెలుస్తోంది. ఇవాళ జపాన్ బిజినెస్ వరల్డ్ లీడర్స్ తో సమావేశం కానున్న కేటీఆర్, జపాన్ కంపెనీ బోష్ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. దీంతో బిఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గైర్హాజరు అవుతున్నారని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ కు కేటీఆర్ సమాచారం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news