నెటిజన్ ట్వీట్ కు పొంగిపోయిన కేటిఆర్…!

-

ఆంధ్రప్రదేశ్ కి చెందిన వ్యక్తులు రాష్ట్ర విభజన విషయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉంటారు. రాష్ట్ర విభజన జరిగి ఆరేళ్ళు దాటినా సరే వాళ్ళు మాత్రం విమర్శలు ఆపే అవకాశం ఉండదు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా తెరాస పార్టీ మీద ఆగ్రహంగానే ఉంటారు.

అయితే ఇప్పుడు ఏపీలో జగన్ పాలన కంటే… తెలంగాణా లో కేసీఆర్ పాలన చాలా బాగుంది అంటూ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొనియాడుతున్నారు. కేసీఆర్ విధానాలను, కేటిఆర్ స్పందిస్తున్న తీరుకి ఫిదా అవుతున్నారు. తాజాగా సుదీర్ అనే ఒక ట్విట్టర్ యూజర్ ఒక ట్వీట్ చేసాడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లను గతంలో ద్వేషించిన తాను ప్రస్తుతం వారి అభిమానిగా మారా అంటూ ట్వీట్ చేసాడు.

నేను తెలంగాణకు చెందిన వాడిని కాదు. తొలుత మిమ్మల్ని, మీ నాన్నను ద్వేషించాను. మీ పాలన చూసి అభిమానిగా మారాను. తెలంగాణే కాదు దేశం మొత్తం మీ నాయకత్వాన్ని పొందుతుందని నేను విశ్వసిస్తున్నాను అని ట్వీట్ చేసారు. దీనిపై స్పందించిన కేటిఅర్ మీలో వచ్చిన పరివర్తనకు అభినందనలు. మీ హృదయంలో ద్వేషం స్థానంలో అభిమానం చోటుచేసుకోవడం ఆనందంగా ఉందని రిప్లయ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news