వేములవాడను యాదాద్రి తరహా అభివృద్ధి చేస్తాం : మంత్రి కేటీఆర్

-

ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న సన్నిధిలో శివరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరిపించాలని అధికారులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మహాశివరాత్రి వేడుకలపై వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, ఇతర అధికారులతో హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

శివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, అదనపు అంబులెన్సు, ఫైర్‌ అంబులెన్సులను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. జాతరకు సౌకర్యాలు కల్పించేందుకు అదనపు నిధులు కేటాయిస్తామని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. వేములవాడను రానున్న రోజుల్లో యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news