ఆ ముగ్గురినీ BRS ఓడిస్తుంది: కేటీఆర్

-

తెలంగాణాలో ఎన్నికల మహాసంగ్రామంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఆడుతారు అన్న విషయాలలో చాలా ఆసక్తి నెలకొంది. ఇక తాజాగా ఈ రోజు ప్రచార సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ మరియు బీజేపీ లకు సవాలు విసిరాడు. కేటీఆర్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో దమ్ముంటే బీజేపీ ఒక్క సీటు అయినా గెలుచుకోమని బహిరంగంగా ఛాలెంజ్ చేశాడు. ఇక గోషామహల్ నియోజకవర్గంలో కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగి అయినా సరే రాజా సింగ్ ను ఓడించి తీరుతాం అంటూ బీజేపీని కేటీఆర్ హెచ్చరించారు. అదే విధంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని తన సొంత నియోజకవర్గం కొండంగల్ లో, మరియు ఈటల రాజేందర్ ను హుజురాబాద్ లో బరా బర్ ఓడిస్తామని కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ లను అమ్ముకుంటూ నేతల సెంటిమెంట్ తో ఆడుకుంటోందని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రానున్న ఎన్నికల్లో BRS ఖచ్చితంగా కాంగ్రెస్, బీజేపీ లను ధీటుగా ఎదుర్కొని రాజపీఠాన్ని దక్కించుకుంటుందని కామెంట్ లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news