ఏపీ లో ఉన్న వాస్తవ పరిస్థితులనే కేటీఆర్ చెప్పారు: ప్రత్తిపాటి పుల్లారావు

-

ఆంధ్రప్రదేశ్ లో కరెంటు, నీళ్లు లేవని రోడ్లు ధ్వంసమయ్యాయి అని తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో కాక పుట్టిస్తున్నాయి.వైసీపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి, మల్లాది విష్ణు, జోగి రమేష్ లు కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు.ఈ నేపథ్యంలో టిడిపి నేత ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, ఏపీ లో ఉన్న వాస్తవ పరిస్థితులనే కేటీఆర్ చెప్పారని అన్నారు.ఒక్క తెలంగాణ మాత్రమే కాదని ..దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ గొప్ప చాటుకునేందుకు ఏపీ తో పోల్చుకుంటున్నాయని చెప్పారు.

అయితే తెలంగాణ అభివృద్ధి, ఏపీ విధ్వంసం ఇవి రెండు కేసీఆర్, జగన్ ల ఆధ్వర్యంలోనే జరిగాయని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు.ఏపీలో భూముల ధరలు 200 శాతం పడిపోయాయని, ఇదే సమయంలో తెలంగాణా లో రేట్లు గణనీయంగా పెరిగాయి అని చెప్పారు.ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని, పరిశ్రమలు మూతపడ్డాయని, ఏ మాత్రం అభివృద్ధి జరగలేదని…అందుకే అందరూ తెలంగాణ సురక్షితమని అనుకుంటున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news