ఎవరు అయినా సరే వదిలిపెట్టేది లేదు: కేటిఅర్ స్ట్రాంగ్ వార్నింగ్

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటిఅర్ మాట్లాడారు. 28 న కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సభ ఉంటుంది అన్నారు. ఎటువంటి కార్యక్రమాలు చేపట్టేది సభలో సీఎం కేసీఆర్ చెబుతారు అని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కేసీఆర్ సభకు స్వచ్చందగా తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేసారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రచార సభ ఉంటుంది అన్నారు.

వేల సంఖ్యలో ప్రజలు వస్తారని మా అంచనా అని ఆయన వివరించారు. హైదరాబాద్ నగరంలో చిచ్చుపెట్టాలని ప్రయత్నం చేస్తే ఊరుకోమని కేసీఆర్ స్పష్టం చేశారు అని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయం లో ఏ పార్టీ వారు అయిన వదలిపెట్టము అని హెచ్చరించారు. మేము ప్రభుత్వం నడుపుతున్న వాళ్ళం…ఎప్పుడు ఏం చేయాలో చేస్తాం అన్నారు. స్వామి గౌడ్ బీజేపీలో చేరికపై ఆయన స్పందిస్తూ… ఎన్నికల ముంగిట పార్టీల్లోకి చేరికలు సహజం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news