కేటీఆర్ చేసిన ఆ ఒక్క పనితో… ఆయనే కాబోయే CM అని తేలిపోయింది?

-

 

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన తరువాతి రోజు నుండే తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా కేటీఆర్ రావడం ఖాయం అనుకున్నారు అంతా. అయితే చంద్రశేఖరరావు మరికొద్ది రోజులు అతని కొడుకుకి సమయం కావాలని అనుకున్నాడో ఏమో కానీ అతనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే ఇప్పుడు కేంద్రంలో బిజెపి పార్టీ చాలా డీలా పడిపోయింది. ఇదే అదనుగా అతని కొడుకును ముఖ్యమంత్రిని చేసేసి తను కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టి క్రియాశీలక పాత్ర పోషించేందుకు కేసీఆర్ సిద్ధమైపోయాడని సమాచారం.

 

ఇలాంటి వార్తలు ఇంతకుముందు కూడా వచ్చాయి కదా అని అంతా అనుకుంటున్న సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఈ పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు మతం మీద విశ్వాసం లేనట్లు వ్యవహరించే కేటీఆర్‌, ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా గుళ్లను చుట్టడం ప్రారంభించాడు. ఎప్పుడూ తన తండ్రి తిరుపతి కి వెళ్ళినా కనీసం తోడుగా కూడా వెళ్ళని కేటీఆర్ సిరిసిల్లలోని వేములవాడను గతనెలలో దర్శించగా, తాజాగా సోమవారం తిరుమలలో దర్శనం ఇచ్చాడు.

దీంతో రాష్ట్ర రాజకీయాల్లోనే అత్యుత్తమ పదవిని చేపట్టేందుకు ముందు భగవంతుని ఆశీస్సులు కావాలని కేటీఆర్‌ అనుకున్నట్లుగా అందరూ భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news