ఇది ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా కాదు : ‘సరిలేరు నీకెవ్వరు’ పై అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్….!!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు పై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ రెండూ కూడా సినిమాపై అంచనాలు అమాంతం పెంచేయగా, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మొన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రత్యేక అతిథిగా విచ్చేసి, సినిమాపై హైప్ మరింతగా పెంచేశారు అనే చెప్పాలి. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తన్న ఈ సినిమాలో మహేష్ బాబు,

మేజర్ అజయ్ కృష్ణ అనే మిలిటరీ మేజర్ పాత్రలో నటిస్తుండగా ఆయన సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. కొన్నేళ్ల తరువాత సీనియర్ నాయకి విజయశాంతి ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తుండడంతో ఆమె ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు. ఇక నేడు ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేక మీడియా సమావేశంలో భాగంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, తమ యూనిట్ కు సినిమా పై ఎంతో నమ్మకం ఉందని, తప్పకుండా మహేష్ గారి కెరీర్లో, అలానే తన కెరీర్ లో ఈ సినిమా మంచి విజయవంతమైన సినిమాగా నిలిచిపోతుందని నమ్మకాన్ని వెలిబుచ్చారు. సాంగ్స్, టీజర్, ట్రైలర్ ల సూపర్ సక్సెస్ తరువాత తామందరికి సినిమాపై మరింత నమ్మకం ఏర్పడిందని, సినిమాలో హీరో,

 

హీరోయిన్ తో పాటు ప్రతి ఒక్క పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని ఆయన అన్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీసారా అని ఒక పాత్రికేయ మిత్రుడు అడిగిన ప్రశ్నకు, అనిల్ రావిపూడి సమాధానమిస్తూ, ఇది పూర్తిగా ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా కాదని, సినిమా కోసం ఒక బలమైన కథాంశాన్ని తీసుకుని, దానికి పలు రకాల కమర్షియల్ హంగులు జోడించి సినిమాను తీశానని, అయితే ఫ్యాన్స్ తో పాటు ఈ సినిమా సాధారణ ప్రేక్షకులు అందరికీ కూడా ఎంతో నచ్చుతుందని అన్నారు…..!!

Read more RELATED
Recommended to you

Latest news