లాలూ.. ఇక జైలుకు రావాల్సిందే..హైకోర్టు

-

 

పెరోల్ పొడగింపును నిరాకరించిన జార్ఖండ్ హైకోర్ట్

పశువుల దాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తోన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు జార్ఖండ్ హైకోర్టు గట్టి షాకిచ్చింది. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా పెరోల్ పై బయటే ఉన్న లాలూ తన పెరోల్ ను మరో మూడు నెలలు పొడిగించాలనే అభ్యర్థనను హైకోర్టు తిరష్కరించింది. ఆగస్టు 30లోపు తిరిగి జైలుకు రావాల్సిందేనని ఆదేశాలు జారీచేసింది.

దాణా స్కామ్ లో లాలూ నిందితుడిగా తేలడంతో రాంచీ సీబీఐ కోర్టు ఆయనకు శిక్ష విధించింది. దీంతో జైల్లో ఉన్న లాలూ అనారోగ్యానికి గురి కాగా మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు.. ఆతర్వాత ఆరోగ్య కారణాల రీత్య పెరోల్ ఇవ్వాలని హైకోర్టుని ఆశ్రయించారు. లాలూ నివేదనను పరిశీలించిన కోర్టు మే 11న తొలిసారి ఆయనకు 6 వారాల ప్రొవిజనల్ బెయిల్ని మంజూరు చేసింది. ఆతర్వాత పెరోల్ని పొడగిస్తూ కోర్టు అనుమతించింది.

లాలూ ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదని..  ప్రస్తుతం ముంబైలోని ఏషియన్ హార్ట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు లాలూ తరుఫు న్యాయవాదులు కోర్టులో విన్నవించి.. పెరోల్ని మరో మూడు నెలలపాటు పొడగించమని కోరారు. వారి అభ్యర్థనను కోర్టు తిరస్కరించి పెరోల్ పొడగించేది లేదని, ఈ నెల 30లోగా తిరిగి జైలుకు రావాలని కోర్టు తేల్చిచెప్పింది.

 

Read more RELATED
Recommended to you

Latest news