ఐసీయూలో లాలు ప్రసాద్ యాదవ్.. కుమార్తె భాగోద్వేగ ట్వీట్

-

రాష్ట్రీయ జనతాదళ్(RJD) అధినేత,బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ రెండు రోజుల క్రితం మెట్లపై నుంచి జారిపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. వీపు భాగాన గాయమై భుజం విరగడంతో ఆయనకు పాట్నాలోని పారస్ ఆసుపత్రిలో ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పలు అనారోగ్య కారణాలతో బాధపడుతూ కిడ్నీ మార్పిడి చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది.

ఈ క్రమంలో ఆయన కుమార్తె రోహిణి ఆచార్య తండ్రి ఆరోగ్య పరిస్థితి పట్ల భావోద్వేగానికి గురయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆయన చిత్రాలను షేర్ చేస్తూ..” నా హీరో. నా బ్యాక్ బోన్. త్వరగా కోలుకో నాన్న. ప్రతి అవరోదం నుంచి విముక్తి పొందిన ఆయన వెంట ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. వారి అభిమానమే ఆయన బలం.” అంటూ ఆమె ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news