తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి – గూడూరు నారాయణరెడ్డి

-

బండి సంజయ్‌ పాదయాత్రపై జరిగిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు బీజేపీ సీనియర్‌ నేత గూడూరు నారాయణ రెడ్డి. బండి సంజయ్‌ పాదయాత్రపై టిఆర్‌ఎస్‌ గూండాలు దాడి పాశవిక చర్య అని మండిపడ్డారు. జనగామ జిల్లా దేవరుప్పల్‌ చౌరస్తాలో బీజేపీ అధ్యక్షుడిపై రాళ్ల దాడికి పాల్పడి టిఆర్‌ఎస్‌ గుండాగిరి చేసిందన్నారు గూడూరు నారాయణ. తెలంగాణలో ఒక పార్టీ అధ్యక్షుడికి కూడా రక్షణ కల్పించలేని దుస్థితిలో పోలీసులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పోలీసులు టిఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా పని చేస్తున్నారని అన్నారు. తెలంగాణాలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు గూడూరు నారాయణరెడ్డి. ప్రజాప్రతినిధులకు సైతం రక్షణ లేకుండా పోతోందన్నారు. పోలీసులు సరియైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే టిఆర్‌ఎస్‌ గూండాలు రాళ్లదాడికి పాల్పడ్డారని అన్నారు. టిఆర్‌ఎస్‌ గూండాగిరికి భయపడే వారెవరూ లేరు…సరియైన సమయంలో దీటైన జవాబు ఇచ్చి తీరుతామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news