షర్మిల పార్టీలో ముసలం : పదవుల కేటాయింపు పై రభస

-

పార్టీ పెట్టి నెల రోజులు తిరగకముందే వైఎస్‌ షర్మిల పార్టీలో ముసలం నెలకొంది. షర్మిల పార్టీ కార్యాలయంలో పదవుల కేటాయింపు పై రభస చోటు చేసుకుంది. షర్మిల పార్టీ లో పదవులు అమ్ముకున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు దేవరకద్రకు చెందిన నర్సింహారెడ్డి.

పార్టీ పదవులు ఏకంగా 5 లక్షలకు అమ్ముకుని రాత్రికి రాత్రే పేర్లు మార్చేసారని నర్సింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిళని వ్యతిరేకించడం లేదు, పార్టీలో ఉన్న కోవర్టులను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. తాను ఎప్పటి నుండో పార్టీకి అంటిపెట్టుకుని ఉన్నానని చెప్పిన ఆయన… ముక్కు మొహం తెలియని వారికి పదవులు ఇచ్చారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు… పార్టీలో ఎవరు ఎవరు సీట్లు అమ్ముకున్నారో తన దగ్గర ఆధారాలు ఉన్నాయని ఆయన నిప్పులు చెరిగారు. తాగుబోతు గాళ్ళకి పదవులు అమ్ముకొని పార్టీని కార్పొరేట్ స్థాయికి తీసుకొని వెళ్లారని తీవ్ర ఆరోపణలు చేశారు నర్సింహారెడ్డి. దీనిపై వైఎస్‌ షర్మిలకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news