హస్తినాను తాకిన అమరావతి నిరసన..!

-

ఏపీ రాజధానిగా అమరావతి నే కొనసాగించాలని రోజు రోజుకి నిరసనలు ఎగిసిపడుతున్నాయి కానీ ఎక్కడా తగిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. దాదాపు 300 రోజులకు చెరువవుతున్నప్పటికీ కూడా ఎక్కడ నిరసనలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఏపీ రాజధానిగా అమరావతి నే కొనసాగించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకునేంత వరకు తమ పోరాటం ఆగదు అంటూ అమరావతి పరిరక్షణ సమితి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఏకంగా ఢిల్లీలో అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఆందోళన చేపట్టారు.

Amravati

రాజ్ ఘాట్ లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు… వికేంద్రీకరణ విషయంలో జగన్ మనసు మార్చుకొని అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని ప్రార్థనలు చేశారు. ఇక ఢిల్లీలో శాంతియుత ప్రదర్శనల ద్వారా తమ నిరసనలు ప్రధాని వరకు చేరేలా దీక్షలు చేపడతాము అంటూ అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news