కాళ్ళు విరుస్తా… వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్

-

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు ఈ మధ్య కాలంలో వివాదాల్లో ఎక్కువగా ఉంటున్నారు. ఎక్కడో ఒక చోట వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన ఒక వైసీపీ నేత ఇచ్చిన వార్నింగ్ సంచలనం అయింది. సామాజిక మాధ్యమాల్లో వైసీపీ నేత వార్నింగ్ ఒకటి బాగా వైరల్ గా మారింది. ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని గ్రామస్తులకు వైసీపీ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

అందరూ భయంగా పని చేసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చిన ఆయన… ఈ సారి ఎవరు బలవుతారో… ఎవరు కారో అంటూ వ్యాఖ్యలు చేసారు. రచ్చకట్ట మీద కూర్చుని చెపుతున్నా పది, పదిహైదు మంది భుజాలు కింద కట్టె పెట్టుకుని నడుస్తారు అంటూ… పరోక్షంగా కాళ్లు విరిచేస్తానంటూ వార్నింగ్ ఇవ్వడం సంచలనం అయింది. నాకు ఎలాంటి దయా దక్షిణ్యాలు లేవు అని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి.

భయం.. భక్తి లేకుండా చేస్తే 20 మంది బలవుతారు అని ఆయన స్పష్టంగా వార్నింగ్ ఇచ్చారు. కునుతూరు, కామిరెడ్డిపల్లి, కట్టకిందపల్లి కావొచ్చు… నాకు పిల్లా జల్లా అనే కనికరం లేదు అని ఆయన అన్నారు. ఎవరి ప్రాణం తీయను… కాళ్ళు విరిచేస్తానంటూ గ్రామస్థులకు ఆయన ఇచ్చిన వార్నింగ్ సంచలనం అయింది. వైసీపీ నేత హెచ్చరికలపై ఎస్పీకి తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేసారు. వైసీపీ నేత నుంచి గ్రామస్థులకు రక్షణ కల్పించాలి అని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news