రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం..!

-

నగర శివార్లలో నెల రోజులుగా కనిపించకుండా తిరుగుతున్న చిరుతపులి ఆచూకీ దొరికింది. మరోమారు రాజేంద్రనగర్‌లోని జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ పరిసరాల్లో సంచరించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. నిన్న రాత్రి విశ్వవిద్యాలయ సమీపంలోని నారం ఫామ్‌హౌస్‌లోని ఓ ఇంట్లోకి వచ్చిన చిరుత.. కిటికీ ఎక్కి ఇంట్లోకి తొంగిచూస్తున్నట్లు కెమెరాల్లో నమోదయ్యింది. దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందిచారు.

Read more RELATED
Recommended to you

Latest news