దిల్ రాజు పెట్టుకున్న ఆశలన్ని ఇప్పుడేమవుతాయో ..?

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రెండేళ్ళు సినిమాలకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేస్తున్నాడనగానే ప్రతీ ఒక్కరికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మేకర్స్ కూడా ఈ విషయంలో చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే దిల్ రాజు లాంటి నిర్మాతలు ఆయనతో సినిమా తీయాలన్నది పెద్ద కోరిక కాబట్టి. ఇది దిల్ రాజుకైతే పెద్ద కల అని చెప్పాలి.

 

అనుకున్నట్టుగానే దిల్ రాజు సాధించాడు. పవన్ కళ్యాణ్ తో సినిమాని నిర్మిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమా కోసం భారీగా ఖర్చు కూడా చేస్తున్నాడు. ఒక రీమేక్ సినిమా… అందులోను రెండు భాషల్లో 100 కోట్ల కు పైగానే వసూళ్ళు రాబట్టిన సూపర్ హిట్ సినిమాని మళ్ళీ మన నేటివిటీకి తగ్గట్టు ..పవర్ స్టార్ ఇమేక్ కి తగ్గట్టు మార్పులు చేర్పులు చేశారు. జనాలలో కొంతమందికి అనుమానాలున్నా ఫ్యాన్స్ కి అలాగే ప్రేక్షకులకి ముఖ్యంగా దిల్ రాజు కి విపరీతమైన నమ్మకం. ఆ నమ్మకంతోనే భారీ సక్సస్ ను ఊహించి దిల్ రాజు ఈ సినిమాని అన్ని కమర్షియల్ హంగులతో తయారు చేస్తున్నాడు.

ఇక ఇన్నాళ్ళు లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన షూటింగ్స్ తిరిగి మొదలుపెట్టుకునేందుకు ముంఖ్యమంత్రి అనుమతులు ఇచ్చారు. జూన్ రెండవ వారం నుంచి అన్ని సినిమాల షూటింగ్స్ మొదలవబోతున్నాయి. దీంతో నిర్మాత దిల్ రాజు కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యాడట. కాని ఇంతలోనే పవన్ కళ్యాణ్ షాకిచ్చినట్టు తెలుస్తోంది. కారణాలు తెలియనప్పటికి ఆగస్టు వరకు షూటింగ్స్ కి పవన్ కళ్యాణ్ రాలేనని తెలిపాడట. వాస్తవంగా అయితే సరిగ్గా నెలరోజులు చేస్తే ఈ సినిమా కంప్లీటవుతుంది. అందుకే పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్టు 15 న వకీల్ సాబ్ ని థియోటర్స్ లోకి తేవాలనుకున్నారు దిల్ రాజు. మరి పవన్ కళాణ్ ఏమో ఇప్పట్లో సెట్స్ కి రాలేనని అంటున్నారట. ఏం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news