లైగర్ సినిమాతో ఎక్కువుగా నష్టపోయింది విజయ్ యేనా.!

-

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే.కాని ఈ సినిమా కోసం విజయ్ తన ప్రాణం పెట్టి పనిచేశాడు. అంతే కాకుండా దేశమంతా విరామం లేకుండా తిరుగుతూ సినిమా ప్రమోషన్లో పాల్గొంటూ సినిమాకు విపరీత మైన ప్రచారం తెచ్చి పెట్టాడు.

సినిమాలో మైక్ టైసన్ కూడా వుండడం తో సినిమాకు సూపర్ హైప్ వచ్చింది. కాని హీరో కి నత్తి వుండడం, స్టొరీ సరిగా లేకపోవటం, ఏంతో ఊహించుకుంటూ వెళ్ళిన మైక్ టైసన్ ఎపిసోడ్ సిల్లీగా వుండడం తో సినిమాకు నెగెటివ్ ప్రచారం జరిగింది. దానితో వసూళ్లు దారుణంగా పడిపోయాయి. దీనితో ఎక్కువ రేటు పెట్టి కొన్న బయ్యర్స్ డబ్బులు నష్టపోయారు. ఇప్పుడు వీరందరూ హీరోపై, పూరి జగన్నాథ్ మరియు ఛార్మి ల పై నష్టం భర్తీ చేయాలని కోరుతున్నారు.

అసలు వీరందరి కంటే ఎక్కువ నష్ట పోయింది విజయ్ దేవర కొండ అని ,విజయ్ సన్నిహితులు అంటున్నారు. తాను ఈ సినిమా కోసం 3 సంవత్సరాలు డేట్స్ ఇచ్చి మంచి బాడీ కోసం చాలా కష్టపడ్డా డని, ఛార్మి దగ్గర డబ్బులు లేక పోతే కొద్దిగా మాత్రమే రెమ్యునరేషన్ తీసుకొని పని చేసాడని చెబుతున్నారు. సినిమా అమ్మిన తర్వాత కూడా తనకు డబ్బులు ఇవ్వలేదని, పై పెచ్చు విజయ్ తన దగ్గర నుండి  కొంత  డబ్బును వెనక్కి ఇచ్చినట్లు వారు అంటున్నారు. దీన్ని బట్టి ఈ సినిమా కోసం ఎవరు ఎక్కువ నష్ట పోయారో చెప్పాలని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news