తెలంగాణకు మిడతల దండు ప్రమాదం..!

-

తెలంగాణకు మళ్లీ మిడతల దండు దాడి కలవరం మొదలైంది. కొద్దిరోజుల క్రితం రాష్ట్రానికి తప్పిపోయినట్టే కనిపించిన ఈ మిడతల దండు ముప్పు… మళ్ళీ మొదలైంది. దీంతో సరిహద్దు జిల్లాలపై మిడతల దండు విరుచుకుపడే ప్రమాదం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు అటవీ, వ్యవసాయశాఖ అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు సరిహద్దున ఉన్న ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాలకు కెమికల్‌ కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కొనుగోలు కోసం ప్రభుత్వం రూ. 53.55 లక్షలకు కేటాయించింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫండ్స్ నుంచి వీటిని విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news