లోకేష్ పాదయాత్ర జబర్దస్త్ కి పోటీగా మారింది – మంత్రి రోజా

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర పై మంత్రి రోజా మరోసారి సెటైర్లు విసిరారు. లోకేష్ పాదయాత్ర రోజు రోజుకి జోకేష్ పాదయాత్ర లాగా సాగుతుందన్నారు. ఈ పాదయాత్ర సాగుతూ సాగుతూ చివరికి జబర్దస్త్ కి పోటీగా నిలబడుతుందని సెటైర్లు విసిరారు. చంద్రబాబుకు చివరి అవకాశం ఇస్తే ఆంధ్ర ప్రజలకు ఇవే చివరి రోజులు అవుతాయని హెచ్చరించారు మంత్రి రోజు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల పాలు చేశారని అన్నారు. చంద్రబాబుకు అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే శాశ్వత కట్టడాలు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. ఒకపక్క వయోవృద్ధుడు, మరోపక్క అసమర్థుడితో తెలుగుదేశం పార్టీ నలిగిపోతుంది అంటూ విమర్శలు గుప్పించారు. లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టిన రోజునుండే రోజా వర్సెస్ లోకేష్ అన్న విధంగా లోకేష్ డైమండ్ రాణి తో పోల్చడం, రోజా లోకేష్ అంకుల్ అంటూ వీరి మధ్య మాటల తూటాలు పేలుతున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news