పాతబస్తీలో విద్యుత్ చోరీ జరిగితే మేము అడ్డుకుంటాం – అక్బరుద్దీన్ ఓవైసీ

-

పాతబస్తీ పై కొందరు రాజకీయ నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. పాతబస్తీలో కరెంటు చోరీ జరుగుతుందని విమర్శిస్తున్నారని.. ఒకవేళ పాతబస్తీలో విద్యుత్ చోరీ జరిగితే మేమే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు అక్బరుద్దీన్. విద్యుత్ ఎసిడి చార్జీల వసూలు పై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.

అసెంబ్లీ ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎంఐఎం ప్రజా ప్రతినిధులు ఉన్నారని, అక్కడ బిఆర్ఎస్ ప్రతినిధులకు ఇచ్చినట్లే ఎంఐఎం ప్రతినిధులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news