వైరలవుతున్న ధోని ఫేర్‌వెల్ సాంగ్..!

-

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్న మహేంద్ర సింగ్‌ ధోని ‌‘నేనో రెండు నిమిషాల కవిని. నాదో చిన్న ప్రయాణం. నాలా ఎందరో వచ్చారు. వెళ్లారు. నేనూ అంతే. మరెందరో నాలాంటి వారు వస్తారు’ అంటూ ఇన్‌స్టాలో తన 16 ఏళ్ల క్రికెట్‌ జర్నీని తెలిపే బెస్ట్‌ మూమెంట్స్‌ తో కూడిన ఫొటోలను మిక్స్ చేసి ఓ పాట రూపంలో వెల్లడించాడు. ఇందుకోసం 1976లో వచ్చిన సూపర్‌హిట్‌ మూవీ ‘కభీ కభీ’లోని ‘మై పల్‌ దో పల్‌ కా షాయర్‌’ పాటను ధోని షేర్‌ చేశాడు. ఈ వీడియోకు 2,86,09,653 వ్యూస్‌ 64,77,407 లైక్స్ తో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

ఇకపోతే ధోనీ కోసం ఫేర్‌వెల్ మ్యాచ్ నిర్వహించాలని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బీసీసీఐకి సూచించిన సంగతి తెలిసందే. జార్ఖండ్ అందుకు వేదిక అవుతుందని కూడా ప్రకటించారు. ధోనీ సొంత రాష్ట్రం జార్ఖండ్ కావడంతో.. ఫేర్‌వెల్ మ్యాచ్ కోసం రాంచీని వేదిక చేయాలని ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ భావించారు. అయితే ధోని ఎప్పుడూ అలాంటి మ్యాచ్‌ను కోరలేదని, దీంతో ఇది జరిగే అవకాశం లేదని ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news