MAA ELECTIONS : పేపర్ బ్యాలెట్ విధానంలోనే “మా” ఎన్నికలు !

-

మా అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికలు చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రకాశ్‌ రాజ్‌ మరియు మంచు విష్ణు ప్యానెల్‌ సభ్యులు నామినేషన్లు వేయగా… ఇరు పక్షాలు ప్రచారం సాగిస్తున్నాయి. అయితే తాజాగా మా ఎన్నికలపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్ క్లారిటీ ఇచ్చారు. పేపర్ బ్యాలెట్ విధానంలోనే మా ఎన్నికలు నిర్వహిస్తామని.. పేపర్ బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరపాలని విష్ణు లేఖ రాశారని పేర్కొన్నారు ఎన్నికల అధికారి కృష్ణమోహన్.

maa elections
ఈవీఎం విధానంలోనే పోలింగ్ నిర్వహించాలని ప్రకాశ్ రాజ్ కోరారని… విష్ణు, ప్రకాశ్ రాజ్ ల ప్రతిపాదనలను కృష్ణంరాజు దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు కృష్ణమోహన్. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజు కూడా పేపర్ బ్యాలెట్ కే మొగ్గు చూపారని.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు పేపర్ బ్యాలెట్ విధానంలోనే మా పోలింగ్ ఉంటుందన్నారు ఎన్నికల అధికారి కృష్ణమోహన్.

2019లో స్థానిక సంస్థలకు పేపర్ బ్యాలెట్ లోనే పోలింగ్ జరపాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని.. ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు జీహెచ్ఎంసీలో కూడా పేపర్ బ్యాలెట్ తోనే పోలింగ్ జరిగిందని వెల్లడించారు. కాగా అక్టోబర్ 10 వ తేదీన మా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news