MAA ELECTIONS : ఆగిపోయిన ”మా” ఎన్నికల పోలింగ్

-

మా అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికల తీవ్ర గందర గోళంగా మారింది. ప్రకాశ్‌ రాజ్‌ మరియు మంచు విష్ణు వివాదం చెలరేగింది. ప్రకాశ్‌ రాజ్‌ కు సంబంధించిన ప్యానెల్‌ సభ్యులు.. పోలింగ్‌ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు మంచు విష్ణు ప్యానెల్‌ సభ్యులు. దీంతో అర్ధాంతరంగా మా అసోషియేషన్‌ ఎన్నికలను ఆపేశారు ఎన్నికల అధికారి.

maa elections

అనంతరం ప్రకాశ్‌ రాజ్‌ మంచు విష్ణు బృందాలను ఎన్నికల అధికారి చర్చలకు పిలిచారు. ప్రస్తుతం రెండు ప్యానెల్‌ బృందాలతో ఎన్నికల అధికారి చర్చలు నిర్వహిస్తున్నారు. రిగ్గింగ్‌ చేసినట్లు తేలితే ఫలితాలు కూడా ప్రకటించబోనని ఈ సందర్భంగా ఎన్నికల అధికారి ప్రకటించారు.

అవసరమైతే.. మా ఎన్నికలపై కోర్టుకు వెళాతమన్నారు. సీసీటీవీ ఫుటేజీ ని పరిశీలిస్తున్నామని చెప్పిన ఎన్నికల అధికారి… రిగ్గింగ్‌ చేస్తే చర్యలు తప్పవన్నారు.ప్రకాశ్‌ రాజ్‌ కు చెందిన వారు దొంగ ఓటు వేశారని ఫిర్యాదు వచ్చిందని.. అలాగే.. మోహన్‌ బాబు.. ఇతరులపై ఆరుస్తున్నారని ఫిర్యాదు వచ్చిందని ఎన్నికల అధికారి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news