ట్రిపుల్ ఆర్ లో హీరోయిన్స్ వీళ్లేనా..?

-

రాజమౌళి డైరక్షన్ లో బాహుబలి తర్వాత అంత భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. సినిమా టైటిల్ గా రామ రావణ రాజ్యం అని ప్రచారంలో ఉంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ విషయంలో క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీస్ కియరా అద్వాని, కీర్తి సురేష్ లు ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేశారని తెలుస్తుంది.

పిరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా స్వాతంత్రానికి ముందు బ్రిటీష్ పరిపాలన నేపథ్యంతో వస్తుందట. సినిమాలో చరణ్ పోలీస్ గా, ఎన్.టి.ఆర్ బందిపోటు దొంగగా కనిపిస్తాడని అంటున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేయిస్తున్న రాజమౌళి తెలంగాణా ఎన్నికల సందర్భంగా హాలీడే ప్రకటించాడు.

మరి హీరోయిన్స్ విషయంలో వస్తున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. మెగా మల్టీస్టారర్ గా వస్తున్న ఈ సినిమాను 2020 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news