రణ్​వీర్​ సింగ్​తో మహేష్ బాబు మల్టీస్టారర్‌‌.. పండ‌గ చేసుకుంటున్న ఫ్యాన్స్‌..!

-

మహేష్ బాబు తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ సంక్రాంతి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల తర్వాత కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా అమెరికాలో హాయిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. మ‌హేష్ నెక్ట్స్ సినిమా అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక తాజాగా మ‌హేష్ బాబు సినిమా గురించి మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ టాలీవుడ్ సూపర్ స్టార్‌‌ బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడట. అది కూడా బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న యంగ్‌ హీరో రణ్‌వీర్‌‌ సింగ్‌తో కలిసి మల్టీస్టారర్‌లో మహేశ్ నటించబోతున్నాడని తెలుస్తోంది.

ప్రస్తుతం మహేశ్, రణ్‌వీర్‌‌ ముంబైలో ఓ వాణిజ్య ప్రకటన చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ షూట్‌ ముగిసిన వెంటనే ప్రముఖ ప్రొడ్యూసర్‌‌ సాజిద్‌ నడియాడ్ వాలా నిర్మించే సినిమాకు సంతకం చేయబోతున్నారని తెలుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోలతో కలిసి హిందీలో ఓ ఫీచర్ ఫిల్మ్ తీయాలని సాజిద్ చాన్నాళ్ల నుంచి ప్లాన్‌ చేస్తున్నాడట. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకవేళ మహేశ్, రణ్‌వీర్‌‌ కలిస్తే ఓ క్రేజీ కాంబో కానుంది. అలాగే విజాతి ధ్రువాలు ఆకర్షించినట్టు యాడ్ ఫిల్మ్ షూటింగ్‌లో ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరిందట. మరి, ఈ ఇద్దరూ వెండితెరను పంచుకుంటారో లేదో చూడాలి. ఇక నిజంగా ఈ క్రేజీ కాంబో కుదురితే ఫ్యాన్స్‌కు పండ‌గే అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news