కంటతడి తెప్పిస్తున్న మహేష్ బాబు ఎమోషనల్ స్పీచ్..!

-

సూపర్ స్టార్ కృష్ణ ఈనెల 15వ తేదీన అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణ మరణం స్టార్ హీరోల మొదటి జనరేషన్ కు స్వస్తి పలికింది. ఇదిలా ఉండగా ఇటీవల హైదరాబాదులో సూపర్ స్టార్ కృష్ణ దశదినకర్మ కార్యక్రమాన్ని ఘట్టమనేని కుటుంబ సభ్యులు చాలా ఘనంగా నిర్వహించారు. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యి అక్కడే ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు.

ముఖ్యంగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల కోసం ఎన్ కన్వెన్షన్ హాల్, అలాగే అభిమానుల కోసం జేఆర్సి కన్వెన్షన్ సెంటర్లలో ఏర్పాటుచేసిన కార్యక్రమాలలో.. కృష్ణ కొడుకు.. సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా తండ్రిని తలుచుకుంటూ మహేష్ బాబు ఎమోషనల్ స్పీచ్ ఇవ్వడం అందరి చేత కంటతడి పెట్టేస్తోంది.. ఈ కార్యక్రమంలో భాగంగానే స్టేజ్ పైకి వచ్చిన మహేష్ బాబు మాట్లాడుతూ..” నాన్నగారు నాకు చాలా ఇచ్చారు . నాకు ఇచ్చిన దాంట్లో అన్నిటికంటే గొప్పది మీ అభిమానం.. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను.. నాన్నగారు ఎల్లప్పుడూ నా గుండెల్లో ఉంటారు.. మీ గుండెల్లో ఉంటారు.. మన మధ్యనే ఉంటారు..

మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అభిమానం , మీ ఆశీస్సులు ఎప్పుడూ నాతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ చెబుతూనే ప్రశాంతంగా.. భోంచేసి వెళ్ళండి” అంటూ అభిమానులకు పిలుపునిచ్చారు మహేష్ బాబు. అయితే తన తండ్రి గురించి ఎమోషనల్ స్పీచ్ చేయాగా.. ఈ వాక్యాలు సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ వీడియోని ప్రస్తుతం నమ్రత తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Read more RELATED
Recommended to you

Latest news