వరిపొట్టుతో గ్లాసులు, ప్లేట్లు తయారు..ఐఏఎస్ అధికారి పెట్టిన పోస్టుకు భిన్నంగా స్పందించిన నెటిజన్లు

-

ప్లాస్టిక్ వినియోగంపై ప్రభుత్వాలు ఎంత కఠిన ఆంక్షలు విధించినా వాటి వాడకం తగ్గటం లేదు. వాడి పడేసే వస్తువలు వినియోగంతో పర్యావరణ కాలుష్యం నానాటికి పెరిగిపోయింది. తాజాగా ఓ కొత్త రకం ఫుడ్‌ కంటైనర్లు ఈ ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా వచ్చాయి. వరిపొట్టుతో తయారైన గ్లాసులు, ప్లేట్లకు సంబంధించిన ఓ వీడియోను ఐఏఎస్‌ అధికారి సుప్రియా సాహు తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. “ఈ ఫుడ్ కంటైనర్లు వరి పొట్టుతో తయారయ్యాయి. ఇవి లీక్ అవ్వవు, పైగా.. తక్కువ ధరకే లభిస్తాయి, భూమిలో తేలిగ్గా కరిగిపోతాయి, పర్యావరణానికి మేలు చేస్తాయి” ఇకనైనా తమిళనాడులోని హోటల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ జాయింట్లలో ప్లాస్టిక్ వాడకం ఆపేసి… ఇలాంటి పర్యావరణ హితమైనవి వాడాలి” అంటూ ఆమె రాసుకొచ్చారు.

ఐఏఎస్‌ అధికారి చేసిన ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో కొద్దిక్షణాల్లోనే బాగా వైరల్‌ అయింది. ఐఏఎస్‌ అధికారి పోస్ట్‌ చేసిన ఈ వీడియోను వీక్షిస్తున్న లక్షలమంది నెటిజన్లు రీ ట్వీట్‌ చేస్తున్నారు. రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒకరు వరిపొట్టుతో తాయరుచేయటం వలన.. ఆవులు, గేదెలకు ఆహార సమస్య వస్తుంది. మనం ఈ అంశాల్ని బ్యాలెన్స్ చెయ్యాల్సి ఉంటుంది అంటే.. మరో యూజర్ “ఇది ఇంట్రెస్టింగ్‌గా ఉంది. థాయిలాండ్‌లో దీని నుంచి నూనెను తీస్తున్నారు. అందువల్ల రైస్ బ్రాన్‌కి పోటీ ఎక్కువ ఉందని అన్నారు. gfx వరి పొట్టుతో గ్లాసులు, ప్లేట్స్‌.. గుడ్‌ బై ప్లాస్టిక్‌..! ఇకపై హోటల్స్‌లో ఇవి వాడితే బెటర్ అని ఐఏఎస్‌ అధికారి పోస్ట్ పెడితే..నెటిజన్లు మాత్రం ఈ యాంగిల్ లో వచ్చారు. సోషల్ మీడియాలో మనం పాజివిట్ పోస్ట్ పెట్టినా భిన్న రకాలుగా నెటిజన్లు స్పందించటం కామనే..లైట్ తీసుకుని లైక్ కొట్టి లాగించేయడే.

అయితే ఇది తయారు చేసే యువకుడు, అతని ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎలా తయారు చేస్తున్నాడు, ఎంత ఖర్చు అవుతుంది, ఈ బిజినెస్ వల్ల లాభమో నష్టమో అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news