లైంగిక వేధింపుల కేసు పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్న మలయాళీ హీరోయిన్..!

-

బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకొని తమిళ్, మలయాళం సినిమాలలో బిజీ హీరోయిన్గా మారిపోయిన పార్వతి నాయర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల తన ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన ఈమె అక్టోబర్లో చెన్నైలోని నుంగంబాక్కం లోని తన ఇంట్లో రూ.9 లక్షలు విలువైన రెండు వాచీలు , రూ.1.5 లక్షల విలువైన ఐఫోన్, రూ.2 లక్షల విలువైన ల్యాప్ టాప్ చోరీకి గురైందని తన ఇంట్లో పని చేసే సుభాష్ పై అనుమానం ఉందని, పార్వతి పోలీసులకు కంప్లైంట్ చేసింది. పార్వతీ ఫిర్యాదు మేరకు సుభాష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి ఇంటికి వెళ్లి మరీ చెక్ చేశారు.

అయితే ఈ దర్యాప్తులో పార్వతి గురించి సుభాష్ కొన్ని విషయాలు వెల్లడించారు.. సుభాష్ మాట్లాడుతూ..” పార్వతీ నాయర్ నాపై లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరించింది. తన ఇంట్లోకి రాత్రిపూట ఎవరెవరో వచ్చి వెళ్లే వాళ్లు .

అది నేను చూశానని నన్ను టార్చర్ పెట్టింది. ఆమె ఇంట్లో చోరీ జరగడంతో అది నా మీదకు తోసేసి నన్ను మానసికంగా వేధిస్తోంది. గతంలో నన్ను కొట్టింది.. నా ముఖంపై ఉమ్ము వేసింది.. నన్ను కావాలనే ఈ దొంగతనం కేసులో ఇరికించింది” అంటూ సుభాష్ వెల్లడించారు.

అయితే పార్వతీ నాయర్ గురించి సుభాష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనానికి దారితీసాయి. అయితే ఈ విషయాలపై పార్వతీ నాయర్ స్పందించకపోవడంతో నిజమేనని కొంతమంది నమ్ముతున్నారు. అయితే గ్లామర్ డోస్ తో మరింత పాపులారిటీ పెంచుకునే పనిలో పడిన ఈ ముద్దుగుమ్మ ఇలా రహస్యంగా గుట్టుచప్పుడు కాకుండా అన్ని సాగిస్తోంది అంటూ సుభాష్ మాటల ద్వారా అర్థమవుతోంది. ఈ విషయం తెలిసిన తర్వాత పలువురు ఈమెపై పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై పార్వతి నాయర్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news