తిరుమల లడ్డూ వివాదం.. తూనికల శాఖ ఏం చెప్పిందంటే..?

-

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం బరువు, నాణ్యత విషయంపై గత కొన్నిరోజులుగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సామాజిక మధ్యమాల్లో ఈ విషయంపై ఓ చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. ఈ క్రమంలోనే శ్రీవారి లడ్డూ విక్రయ కేంద్రాన్ని అసిస్టెంట్‌ కంట్రోలర్‌ పి.సుధాకర్‌తో కలిసి తూనికలు, కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్‌ సీహెచ్‌ దయాకర్‌రెడ్డి సందర్శించారు. కౌంటర్లలో లడ్డూలను తూకం వేసిన అధికారులు బరువును పరిశీలించారు. వారి పరిశీలనలో 160 నుంచి 194 గ్రాముల మధ్య లడ్డూ బరువు ఉన్నట్లు గుర్తించారు. భక్తులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, నిబంధనల మేరకే బరువు, నాణ్యత ఉన్నాయని స్పష్టం చేశారు.

లడ్డూ విక్రయకేంద్రాన్ని తరచూ తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారని దయాకర్ రెడ్డి తెలిపారు. ఆ సమయంలో ఎటువంటి తేడాలు లేవని పేర్కొన్నారు. లడ్డూ బరువుపై ఇటీవల సోషల్‌ మీడియాలో వచ్చిన భక్తుని వీడియోను పరిశీలించామని చెప్పారు. బరువు తక్కువ చూపించిన తూనిక యంత్రాన్ని పరిశీలించగా అందులో ఓ వైరు మధ్యలో పడటంతో తేడా వచ్చినట్లు గుర్తించామని, దీనిపై సంబంధిత కౌంటర్‌ సిబ్బందికి అవగాహన లేకపోవడంతో వివాదం నెలకొందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news