4 ఎమ్మెల్యేలు గడ్డితిన్నంత మాత్రాన అంతా అలా ఉంటారనుకోవడం పొరపాటు – మల్లాది విష్ణు

-

తెలుగుదేశం పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు వైసిపి ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఏపీకి చంద్రబాబు ఏం చేశాడు, మేం ఏం చేశామో చెప్పడానికి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. టిడిపి అధికారంలో ఉండగా ఏం చేశారో చెప్పుకోవడానికి ఏమీ లేదని.. అందుకే ఇప్పుడు ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. లోకేష్, బాలకృష్ణ జోకర్లు అని.. అచ్చెన్నాయుడు కి అసలు బుర్రే లేదని ఎద్దేవా చేశారు.

ఎవరో నలుగురు ఎమ్మెల్యేలు గడ్డి తిన్నంత మాత్రాన.. అందరూ అలా ఉంటారు అనుకోవడం పొరపాటని స్పష్టం చేశారు. మా గురించి మానేసి ముందు మీ పార్టీ గురించి ఆలోచించుకోవాలని హితవు పలికారు. ప్రజల గుండెల్లోంచి వచ్చిన కార్యక్రమమే ‘జగనన్నే మా భవిష్యత్తు’ అని తెలిపారు. ఏడాది ముందే ప్రజల ముందుకు వెళ్లగలిగే గట్స్ ఉన్న ఏకైక పార్టీ వైసిపి అని అన్నారు మల్లాది విష్ణు. విద్యా, వైద్య రంగంలో సమూల మార్పులు తెస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news