రేపు ఢిల్లీకి మమతా బెనర్జీ… పశ్చిమ బెంగాల్లో గెలిచిన తర్వాత మొదటిసారిగా ఢిల్లీకి దీదీ.

-

చాలా కాలం తరువాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి ఈనెల 25 వరకు ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రస్తుతం బీజేపీ, టీఎంసీ మధ్య సంబంధాలు వాతావరణం ఉప్పు నిప్పులా ఉన్నాయి. ఈ పర్యటనలో మమతా బెనర్జీ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. దీంతో పాటు ఆమె ప్రధాని నరేంద్ర మోదీతో కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీపై ప్రస్తుతానికి ఎటువంటి తేదీ ఖరారు కాలేదు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి వారం రోజుల ముందు తృణమూల్ కాంగ్రెస్ అధినేత దేశ రాజధానిలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు ప్రతిపక్ష నేతలను కూడా కలిసే అవకాశం ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా పలు రాజకీయ పార్టీల మద్దతు కూడా గట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గతంలో మమతా బెనర్జీ ఈ ఏడాది జూలైలో ఢిల్లీకి వచ్చారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె ఢిల్లీకి రావడం ఇదే తొలిసారి. గత  పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.మోదీతో పాటు గతంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో సహా ఇతర రాజకీయ నేతలను కలిశారు. వీరితో పాటు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్, కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మలను కూడా కలిశారు.

Read more RELATED
Recommended to you

Latest news