పెద్దపల్లిలో ఘోరం: రోడ్డుపై తల.. మొండెం కోసం వెతకగా షాకైన పోలీసులు

-

పెద్దపల్లి జిల్లాలో ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు. ఆపై శరీరభాగాలను ముక్కలుగా నరికి వీధికొక్కటి విసిరారు. మొదట తలను గుర్తించిన పోలీసులు మొండెం కోసం వీధికి ఒక్కటి చొప్పున శరీర భాగాలను లభించడంతో పోలీసులు షాకయ్యారు. ఇంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఏమున్నదని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా ఖాజీపల్లిలో ఉండే కాంపల్లి శంకర్(35) గోదావరిఖనిలోని విఠల్‌నగర్‌ మీ సేవ కేంద్రంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. శంకర్ అదృశ్యం కావడంతో శుక్రవారం తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం ఉదయం ఎన్‌టీపీసీ ప్లాంటు గోడ వద్ద శంకర్ తలను గుర్తించిన పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటికి వచ్చింది. రాత్రి వరకు వీధికొక్కటి చొప్పున పడేసిన శరీరభాగాలను పోలీసులు ఒక్కచోటుకి చేర్చారు. భార్య, ఆమె బంధువులే తన కుమారుడిని కిరాతకంగా హత్య చేశారని శంకర్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news