ఆంధ్ర ప్రదేశ్ లో దారుణం.. 108 ను ఢీ కొట్టిన రైలు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో శ్రీ‌కాకుళం జిల్లా ల ప‌లాస రైల్వే స్టేష‌న్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక 108 అంబులెన్స్ ను రైలు ఢీ కొట్టింది. అంతే కాకుండా ఆ 108 అంబులెన్స్ ను రైలు దాదాపు 100 మీట‌ర్ల దూరం వ‌ర‌కు ఈడ్చు కెళ్లింది. అయితే ప‌లాస నుంచి ఒక రోగి ని ఆస్ప‌త్రి కి తీసుకు రావ‌డానికి వ‌స్తున్న 108 అంబులెన్స్ ను ప‌లాస రైల్వే స్టేష‌న్ వ‌ద్ద రైలు ఢీ కొట్టింది.

కాగ రైలు ఢీ కొట్టిన స‌మ‌యం లో అంబులెన్స్ లో అంబులెన్స్ డ్ర‌వైరు తో పాటు ఒక వైద్య నిపుణుడు ఉన్నాడు. అయితే ప్ర‌మాదం సమ‌యం లో వీరు అంబులెన్స్ నుంచి బ‌య‌ట ప‌డ్డారు. దీంతో అంబులెన్స్ డ్రైవ‌ర్ కి, వైద్య నిపుణి కి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అక్క‌డ ఉన్న వారంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్ర‌మాదం ఎలా జ‌రిగిందో పూర్తి వివ రాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news