ఏపీలో దారుణం : 50 రూపాయల కోసం గొడవ, యువకుడి మృతి !

-

ఒక్కో ఘటన వింటున్నప్పుడు ఇంత చిన్న మొత్తం కోసం కూడా గొడవలు జరుగుతాయా ? మనం ఏమైనా సోమాలియాలో ఉన్నామా ? లేక ఇండియాలోనే ఉన్నామా ?అనే అనుమానం కలగక మానదు. అయితే ఇక్కడ చిన్న మొత్తం, పెద్ద మొత్తం అనే దానికంటే మనుషుల మధ్య ఉన్న ఈగో విషయంగానే ఎక్కువ గొడవలు పెద్దవి అవుతూ ఉంటాయి. అలంటి గొడవలే ప్రాణాల మీదకు తెస్తుంది.

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దారుణ ఘటన జరిగింది. యాభై రూపాయల కోసం జరిగిన ఘర్షణలో ఒక యువకుడు మృతి చెందాడు. విజయ పాల డైరీలో రూ 50 రూపాయలు అప్పు విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో పాల డైరీ ఉద్యోగిగా పనిచేస్తున్న బాజీ అనే యువకుడి మీద దాడి జరిగింది. వరుసగా పిడిగుద్దులు గుద్దటంతో అక్కడికక్కడే బాజీ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా బాజీ మార్గమధ్యంలోనే మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Latest news