ఆదిలాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం !

-

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసీ కే వద్దనున్న  క్యాంపు లో మంటలు చెలరేగాయి. పిప్పలకోటి  సమీపంలో పెంగంగా నదిపై నిర్మిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనుల వద్ద ఈ భారీ అగ్నిప్రమాదం జరిగింది. పిప్పల్ కోఠీకి సంబంధించిన కాలువ నిర్మాణం చేస్తున్నారు.. ఆ ప్రదేశం సమీపంలో నిర్మాణ సంస్థ కూలీల కోసం ఏర్పాటు చేసిన క్యాంప్ లో మంటలు చెలరేగడంతో పలు వాహానాలకు నిప్పంటుకుంది.

fire
fire

సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకున్నా రెండు టిప్పర్లు, ఒక  ట్రాక్టర్, రెండు బైకులు దగ్ధం అయ్యాయి. మంటల్లో ఒక్కరిద్దరు చిక్కుకొని ఉంటారని స్థానికులు చెబుతున్నారు. మంటల్లో ఒక్కరు సజీవ దహనం అయ్యారని అంటున్నారు. అయితే మంటలు ఎలా వచ్చాయనేది ఇంకా క్లారిటీగా చెప్పడం లేదు.. ప్రమాదంలో 5 లారీలు,  ప్రొక్లైనర్ లకు మంటలు అంటుకున్నాయి అని అంటున్నారు. ఫైర్ ఇంజన్ ,పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేస్తున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news