తాడేపల్లిలో దారుణం.. గంజాయి మత్తులో యువతిని ఘోరంగా నరికి..

-

ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఎన్టీఆర్‌ కట్ట ప్రాంతంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న అంధురాలైన యువతిపై అదే ప్రాంతంలో ఉంటున్న దుండగుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే లోపే  ఆమె ప్రాణాలు కోల్పోయింది.

కానిస్టేబుల్-దారుణ హత్య

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. దాడి చేసిన వ్యక్తిని రాజుగా గుర్తించి.. అతడి కోసం గాలింపు చేపట్టారు. గంజాయి మత్తులో అతడు ఈ దాడి చేసినట్లు సమాచారం. ఆదివారం రోజున రాజు యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో.. ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వాళ్లు అతడిని నిలదీశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు.

Read more RELATED
Recommended to you

Latest news