రామ్ చరణ్ కొత్త పార్టీ.. నాయకుడు వచ్చేస్తున్నాడంటూ..!

-

రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ఆర్సి 15 అనే వర్కింగ్ టైటిల్ పేరుతో షూటింగ్ శెరవేగంగా జరుపుకుంటుంది.. గత కొంతకాలంగా షూటింగుకు బ్రేక్ ఇచ్చిన చిత్ర యూనిట్ మళ్ళీ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. నిన్న హైదరాబాద్ చార్మినార్ దగ్గర కొత్త షెడ్యూల్ ని కూడా దర్శకుడు శంకర్ మొదలుపెట్టేశారు. ఈరోజు తన షూటింగు కర్నూల్ కి షిఫ్ట్ చేస్తున్నాడు శంకర్..

ఇకపోతే రాయలసీమలో ప్రసిద్ధిగాంచిన కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ఆర్సి 15 సినిమా షూటింగు జరుపుకుంటుంది. భారీ సంఖ్యలో అభిమానులు షూటింగ్ స్పాట్ కి చేరుకున్నారు. దీంతో పోలీసులు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ విధించారు. బురుజు సమీపంలో ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు అని ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ అభ్యుదయ పార్టీ నాయకుడిగా కనిపించనున్నాడు.. అయితే ఈ పార్టీకి పసుపు, ఆకుపచ్చ వర్ణం కలిగిన జెండా చూపించడంతో టీడీపీ పార్టీని దృష్టిలో పెట్టుకొని సినిమాను తెరకెక్కిస్తున్నారా అంటూ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇకపోతే తాజాగా ఈ షూటింగ్ స్పాట్ నుంచి విడుదలైన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అభ్యుదయ పార్టీ నాయకుడు వచ్చేస్తున్నాడు అంటూ ఫోటోలు మరింత వైరల్ గా మారడం గమనార్హం. ఏది ఏమైనా రాజకీయ నాయకుడిగా ప్రేక్షకులను రాంచరణ్ ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news