ఫోన్ లో డేటా బ్యాలెన్స్ అవగొట్టాడని తమ్ముడ్ని చంపేశాడు !

-

తన మొబైల్ ఇంటర్నెట్ డేటాను మొత్తం వాడేసినందుకు గాను రాజస్థాన్లోని జోధ్పూర్ కి చెందిన ఒక 23 ఏళ్ల యువకుడు  తన తమ్ముడిని పొడిచి చంపిన ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుటుంబ సభ్యులు బుధవారం అర్ధరాత్రి సమయంలో ఇంటి మీద పడుకున్న చిన్న కుమారుడు రక్తపు మడుగులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు, అక్కడకి వెళ్ళేలోపు అతను చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.

అయితే తన తమ్ముడిని పొడిచి నిందితుడు పారిపోయాడని, శుక్రవారం నాడు అతనిని స్థానిక రైల్వే స్టేషన్ నుంచి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. “బుధవారం సాయంత్రం, రామన్ తన తమ్ముడు రాయ్ ను ఇంటి మేడ మీదకు తీసుకెళ్లి, తన ఇంటర్నెట్ డేటా ను వాడినందుకు తిట్టాడు. “కోపంతో, రామన్ రాయ్ ను అతని ఛాతీలో నాలుగైదు సార్లు పొడిచి పారిపోయాడు” అని పోలీసులు తెలిపారు. పోలీసు అధికారులు చెబుతున్న దాని ప్రకారం, నిందితుడు మానసిక ఇబ్బందులతో బాధ పడుతున్నాడు. 

Read more RELATED
Recommended to you

Latest news