మద్యానికి డబ్బులివ్వలేదని.. కన్నతల్లిపై కిరోసిన్​ పోసి నిప్పు

-

కేరళలోని త్రిస్సూర్ లో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి డబ్బులివ్వలేదని ఓ వ్యక్తి కన్నతల్లినే చంపేశాడు. మద్యానికి డబ్బు అడిగితే ఇవ్వలేదని తల్లిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి చెందింది. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే.. చమ్మన్నూర్ అనే గ్రామంలో శ్రీమతి(75)కి మనోజ్(53) అనే కుమారుడు ఉన్నాడు. అతడు తరచూ మద్యం తాగడానికి డబ్బులివ్వమని తల్లితో గొడవ పడేవాడు. అయితే బుధవారం మరోసారి అదే విధంగా అడిగాడు. డబ్బులు ఇవ్వడానికి తల్లి నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన.. మనోజ్​ తల్లిపై కిరోసిన్ పోసి తగలబెట్టాడు.

85 శాతం కాలిన గాయాలతో ఆ మహిళను మొదటగా కున్నంకులంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మరో త్రిస్సూర్​లోని మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్సకు కూడా ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల ఎర్నాకులంలోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా ఆమె పరిస్థితి కోలుకోలేదు. పరిస్థితి విషమించడం కారణంగా బుధవారం మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మనోజ్​ను అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news