అసెంబ్లీ ఎదుట పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

-

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. శాసనసభలో పద్దులపై రెండో రోజు చర్చ కొనసాగుతోంది. రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు నేటి చర్చను ప్రారంభించారు. రాష్ట్రంలో వైద్య కళాశాలల ఏర్పాటు..తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యం గురించి హరీశ్ రావు మాట్లాడారు.


మరోవైపు శాసనసభ వద్ద రామ్‌నగర్ కార్పొరేటర్ రవిచారి ఆందోళనకు దిగారు. ఆయన్ను అక్కడ గస్తీలో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో రవిచారి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు వెంటనే అడ్డుకుని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news