జూ ఎన్టీఆర్ ను పట్టించుకోక పోవడం పై మండి పడిన మంచు లక్ష్మి..!!

-

రామ్ చరణ్ జూ ఎన్టీఆర్ హీరోలుగా, దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీ సంచనాలకు హద్దే లేకుండా పోతుంది. దేశం వరకే పరిమితం అనుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రపంచంలో టాక్ అఫ్ ది టౌన్ అయింది. ఇప్పటికే ఆస్కార్‌ బరిలో నిలిచిన ఈ మూవీ అనేక అవార్డులు సాధిస్తోంది.ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డును గెలుచుకోగా, లాస్ ఏంజెలీస్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డుకు అడుగు దూరంలో ఆగి పోయారు.  ఇక బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎమ్‌ఎమ్‌ కిరవాణి లాస్ ఏంజెలీస్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకున్నారు.

తాజాగా   అమెరికన్ వెరైటీ` మ్యాగజీన్‌ ప్రకటించిన టాప్‌ 10 బెస్ట్ యాక్టర్స్ లిస్ట్ లో ఎన్టీఆర్‌ పేరు కూడా చోటు చేసుకుంది. అసలు ఇలాంటి వాటిలో మన దేశపు నటులను కనీసం పరిగణ లోకి తీసుకోని పరిస్థితులలో తారక్  వరల్డ్ టాప్ లెవెల్ ఉండటం సూపర్ అంటే సూపర్.  ఈ లిస్ట్ లో విల్‌ స్మిత్‌, హ్యూ జాక్మన్‌ వంటి ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ తో జూ ఎన్టీఆర్ పోటీ పడటం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయాన్ని సెలబ్రిటీలు,మీడియా పట్టించు కోకపోవడం పై ముంచు లక్ష్మి మండి పడింది.

ఈ ఘనత ఒక్క ఏన్టీఆర్‌ మాత్రమే సాధించారు. ఓ ఇంటర్నేషనల్ మ్యాగజీన్‌లో ఇండియాకో స్థానం సంపాదించి పెట్టారు. అయితే ఎన్టీఆర్ ఘనత ఎందుకు, ఎవరికీ కనిపించలేదంటూ మండి పడ్డారు మంచు లక్ష్మీ. తాజాగా ట్వీట్ చేస్తూ ఎస్ ! ఎన్టీఆర్ క్రియేట్ చేసిన ఈ రేరెస్ట్ ఆఫ్‌ ది రేర్‌ రికార్డును ఎవరూ పట్టించకోవడం లేదని పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news